calender_icon.png 25 September, 2024 | 7:59 PM

బేగంపేటలో రోడ్డు ప్రమాదం: కుమార్తె మృతి, తండ్రికి గాయాలు

26-08-2024 12:07:42 PM

హైదరాబాద్: బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. వీరి బైక్‌ను టెంపో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కుమార్తె ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి శంకర్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. తండ్రీకూతుళ్లు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఎస్‌పిఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా  పనిచేస్తున్న శంకర్‌రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నివాసి. ప్రమాదంతో బేగంపేట-పంజాగుట్ట మార్గంలో కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.