మేడ్చల్: హైదరాబాద్-వరంగల్ హైవేపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. దీంతో గిరి 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి మరణించాడు. మేడ్చల్- పోచారం ఐటీ కారిడార్ వద్ద గిరి అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తిని ఎడమ పక్కన ఢీకొన్న కారు కూడిపైపున ఆపి నట్లే ఆపి వరంగల్ హైవేపై దూసుకుపోయింది. దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సెల్ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి రోడ్డు దాటేందుకు వేగంగా వెళ్లడంతో ఢీకొంది.