calender_icon.png 21 September, 2024 | 8:11 PM

ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తి.. ఢీకొన్న కారు

15-07-2024 12:53:34 PM

మేడ్చల్: హైదరాబాద్-వరంగల్ హైవేపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. దీంతో గిరి 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి మరణించాడు. మేడ్చల్- పోచారం ఐటీ కారిడార్ వద్ద గిరి అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తిని ఎడమ పక్కన ఢీకొన్న కారు కూడిపైపున ఆపి నట్లే ఆపి వరంగల్ హైవేపై  దూసుకుపోయింది. దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు కారు డ్రైవర్‌ ప్రయత్నించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి రోడ్డు దాటేందుకు వేగంగా వెళ్లడంతో ఢీకొంది.