calender_icon.png 22 September, 2024 | 2:14 PM

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

22-09-2024 02:07:53 AM

ఒకరు మృతి

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 21: పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన సోపతి శ్రీవల్లి(23), మేడిశెట్టి శివ, సానిక అనిల్  కారులో శుక్రవారం నల్గొండకు వెళ్లారు. రాత్రి తిరిగి స్వస్థలానికి వస్తుండగా బలిజగూడ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద కారు అదుపుతప్పి బొల్తా పడింది. అనంతరం డివైడర్ ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందింది. శివ, అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీవల్లి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. గాయపడినవారిని 108లో స్థానిక దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.