19-04-2025 09:36:33 PM
వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన రిషి ఐఐటి అకాడమీ..
అసాధారణ ర్యాంకులు సాధించి అత్యుత్తమ స్థానంలో రిషి కళాశాల..
విద్యార్థిని విద్యార్థులను అభినందించిన రిషి కళాశాల డైరెక్టర్ చంద్రకళ వెంకటరెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రిషి ఐఐటి అకాడమీ జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ఫలితాలను సాధించింది. వెయ్యిలోపు ర్యాంకులు సాధించి తమకు మరెవరు సాటి లేరనే సాంకేతాన్ని పంపింది. జాతీయస్థాయి జేఈఈ ఫలితాలలో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రిషి ఐఐటి అకాడమీ విద్యార్థుల ర్యాంకులు ఇలా ఎన్ రోహిత్ రెడ్డి 308 వ ర్యాంకు, జంగం శ్రీ తులసి 927 వ ర్యాంకు సాధించారని రిషి జూనియర్ కళాశాల చైర్మన్ చంద్రకళ వెంకట్ తెలిపారు.
సాయి సుజన్ రెడ్డి 98.40 శాతం, ఎస్ ప్రణీత్ కుమార్ 98.04 శాతం, సాయి అక్షయ 97.08 శాతం, తరుణ్ సాయి 96.76 శాతం సాధించడంతోపాటు 90 శాతం కు పైగా 36 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కి 45 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పేందుకు తాము చాలా సంతోషం పడుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల చైర్మన్ చంద్రకళ వెంకట్ , అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య, అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి, అధ్యాపకులు , అధ్యాపకేతర బృందం, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.