calender_icon.png 25 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లులో రేషన్‌బియ్యం

12-08-2024 01:28:24 AM

బియ్యాన్ని సీజ్‌చేసిన పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ

రాజేంద్రనగర్, ఆగస్టు11: రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న ఓ మిల్లుకు తాళం వేసి నట్లు పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. శంషా బాద్ మండలం పెద్దగోల్కొండలోని రాజరా జేశ్వరి రైస్‌మిల్లు ర్వాహకులు కొన్నేళ్లుగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు గుర్తిం చారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని రాజరాజేశ్వరి రైస్‌మిల్లులో డంప్ చేస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో ఆదివారం పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధి కారులతో కలసి..  డీటీ మాచన రఘునం దన్ దాడులు చేశారు. సుమారు 40 టన్ను లకు పైగా రేషన్ బియ్యం స్టాక్‌ను సీజ్ చేశా రు. మిల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవా లని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.