నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ శివారులో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో మల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి మల్లూరు సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నామని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వారు కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని వారు అన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ భిక్షపతి మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, నోడల్ అధికారి కరుణాకర్ రెడ్డి, సీఈవోలు సంగమేశ్వర్ గౌడ్, సాయిలు తదితరులు ఉన్నారు.