calender_icon.png 2 April, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ధ్యేయం

01-04-2025 12:10:00 PM

గడ్డిఅన్నారం మార్కెట్​ కమిటీ చైర్మన్​ చిలుక మధుసూదన్​రెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్​: పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయమని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్​ చిలుక మధుసూదన్​రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్​మెట్​ మండలం, అనాజ్​పూర్​ గ్రామంలో గడ్డిఅన్నారం మార్కెట్​ కమిటీ చైర్మన్​ చిలుక మధుసూదన్​రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలుక చిలుక మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్​ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్​ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.