calender_icon.png 25 October, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్ చెరువులకు పునర్ వైభవం : మేయర్

25-10-2024 04:56:53 PM

HMDA నిధులతో  రూ.11 కోట్లతో టెండర్లు

మంజూరైన నిధుల వివరాలు రా చెరువు - రూ.5 కోట్లు, సుద్దకుంట - రూ.3 కోట్లు, అల్మాస్ కుంట రూ.2.50 కోట్లు

త్వరలోనే పనులకు శ్రీకారం.. హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు

మేడిపల్లి, (విజయక్రాంతి): బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కృషి ఫలితంగా నగరంలోని చెరువులకు మహర్దశ రానుంది. బోడుప్పల్ చెరువుల రూపురేఖలు పూర్తిగా మారిపోయి పునర్ వైభవం సంతరించుకోనున్నాయి. బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే చెరువుల సుందరీకరణ కోసం HMDA నిధులు మంజూరు అయ్యేలా చోరవ తీసుకుని బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సుద్దకుంట, రా చెరువు, అల్మాస్ కుంటా చెరువులను సుందరీకరించే ప్రక్రియలో భాగంగా మొదటి దశ పనుల్లో భాగంగా ట్రాక్ నిర్మాణం కోసం రూ.11 కోట్ల నిధులతో  టెండర్లు పిలవడం జరిగింది.టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ట్రాక్ నిర్మాణం పూర్తి చేసిన అనంతరం రెండో దశ పనులు కూడా పూర్తి అయ్యేందుకు కృషి చేస్తానని అజయ్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషి ఫలితంగానే నేడు ఈ నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.