calender_icon.png 6 October, 2024 | 6:37 PM

కల్వకుర్తిలో మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

06-10-2024 04:10:22 PM

కల్వకుర్తి : రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 3 గంటలకు కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండల కేంద్రానికి  చేరుకుంటారని, అక్కడి నుండి 3:30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల అదనపు తరగతి గదుల శంకుస్థాపన పనులను ప్రారంభిస్తారని తెలిపారు.

సాయంత్రం 4 గంటల నుంచి  5:30 గంటల వరకు కల్వకుర్తి పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు కల్వకుర్తి పట్టణంలోని సిసి రోడ్లు, మున్సిపల్ అభివృద్ధి పనులు, జూనియర్ కళాశాల, కేజీబీవీని ఇంటర్ స్థాయికి పెంపు, అదనపు తరగతి గదుల శంకుస్థాపన పనుల్లో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పాల్గొంటారని ఆయన తెలిపారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 5:45 గంటలకు కల్వకుర్తి మండలంలోని గుండూర్  చేరుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ప్రారంభించి, అనంతరం సాయంత్రం 6:00 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారని కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.