calender_icon.png 10 October, 2024 | 2:49 AM

రేవంత్ రెడ్డి చేసింది ఘోర తప్పిదం

10-10-2024 12:51:30 AM

బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ 

హైదరాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): సర్వే చేయకుండా ప్రజ ల ఇళ్లను కూల్చిన రేవంత్ రెడ్డి ఘోర తప్పిదం చేశారని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హై డ్రా కలతతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఇళ్లను కూల్చి, అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన పాపానికి రేవంత్‌రెడ్డికి ప్రజాకోర్టులో ముమ్మాటికీ శిక్షార్హుడేని మండిపడ్డారు.

బుధవారం శ్రవణ్ దాసోజు తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పరిపాలనలో రేవంత్ రెడ్డి తుగ్లక్‌ను తలదన్నెలా వ్యవహరిస్తున్నారన్నా రు. హైకోర్టు చొరవతో సీఎం తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సొంత అన్నతో పాటు ఇతర ధనికులకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టి.. పేదల ఇండ్లను మాత్రం కూల్చి వారికి కన్నీళ్లు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.