calender_icon.png 23 October, 2024 | 5:10 AM

హిందువులంటే రేవంత్ రెడ్డికి ద్వేషం

23-10-2024 02:26:58 AM

ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): హిందువులంటే సీఎం రేవంత్ రెడ్డికి ద్వేషమని  ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేకతతో పనిచేస్తోందని విమర్శించా రు. కాంగ్రెస్ ఏనాడు కూడా మత విద్వేషాలు సృష్టించే వారిని నియంత్రించలేదన్నారు. మంగళవారం  బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మతోన్మాదులకు షెల్టర్ ఇస్తూ వారిని పోషిస్తు న్నదన్నారు. 

మోదీ ప్రధాని అయ్యాక మతకలహాలపై ఉక్కుపాదం మోపారన్నారు. దాడులకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపిన  బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దు ర్మార్గమన్నారు. వెంటనే వారిని విడుదల చేసి కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ  నేతలను వేధిస్తే సహించేది లేదన్నా రు.తెలంగాణలో స్లీపర్‌సెల్స్ ఉన్నాయని, టెర్రిస్టులకు అడ్డాగా మారింద ని కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా రాష్ట్రం  పట్టించుకోవడం లేదన్నారు.