జగిత్యాల,(విజయక్రాంతి): విధి నిర్వహణలో అందరి మన్నన అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐ వాలి బెగ్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్యలను శాలువా, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను సోమవారం అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అందజేశారు. జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణలో ముఖ్య అతిథిగా పాల్గొన ఎస్పీ మాట్లాడుతూ అనేక త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యుల తో ఆనందంగా, భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిoచారు.పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, వేణు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.