calender_icon.png 10 October, 2024 | 4:55 AM

కాజీపేట్-దాదర్ రైలు పున:ప్రారంభం

09-10-2024 12:00:00 AM

నిజామాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గత తొమ్మిది నెలలుగా రద్దయిన నిజామాబాద్ మీదుగా నడిచే కాజీపేట్-దాదర్ రైలును ఈ నెల 13 నుంచి పున:ప్రారంభించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఈ రైలు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల ప్రజలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ముంబై వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు.

గత తొమ్మిది నెలల క్రితం అయోధ్య ప్రయాణికుల కోసం రద్దు చేసిన ఈ రైలును తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్‌కు ఎంపీ అరవింద్ విజ్ఞప్తి చేశారు. అంగీకరించిన మంత్రి రైలును అక్టోబర్ 13 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.