23-04-2025 12:49:42 AM
ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ చంద్రకళ వెంకట్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి కళాశాల అద్భుత ఫలితాలను సాధించింది. అరుదైన పర్వతాలు రిషి కళాశాల సొంతం చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రిషి కళాశాల వైపు చూసేలా పాలమూరు జిల్లా పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేసింది. ఈ సందర్భంగా రిషి జూనియర్ కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితా లు సాధించారని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు.
తమ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం విభాగం నుంచి ఎంపీసీ యం భావన 468, ఏడు మంది విద్యార్థులకు 467 మార్కులు, బైపిసి నందు మలిహ కహేకశ 438/440, ముగ్గురు విద్యార్థులకు 437/440 మార్కులు, ముగ్గురు విద్యార్థులకు 436/440 మార్కులు సాధించారని తెలిపారు. రెండవ సంవత్సరం విభాగం నుండి ఎంపీసీ నందు టి.మేఘన 993/1000, ఐదుగురు విద్యార్థులకు 990/1000 పైగా మార్కులు, బైపిసి నందు మలిహ తహనియత్ 992/1000 మార్కులు, ఐదుగురు విద్యార్థులు 990/1000 పైగా మార్కులు సాధించారని కళాశాల యాజమాన్యం తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్ , అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య ప్రత్యేకంగా పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మి నిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేంద్ర రావు, అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.