జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 3: ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకత జిల్లా కార్యాల యాల సముదాయంలోని ఆడిటోరి యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించి, సమ స్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
కాగా ప్రజావాణిలో మొత్తం 32 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, గౌతమ్’రెడ్డి, ఆర్డీఓలు మధుసూధన్, జివాకర్’రెడ్డి, ఏఓ హన్మంతరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.