11-04-2025 05:09:46 PM
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా..
బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రజా ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే ఫిర్యాదులను తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సిపి వెంట మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు ఆఫ్జలుద్ధిన్, కుమారస్వామి, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె. మహేందర్ లతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.