calender_icon.png 29 October, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే ఆడబిడ్డలకు గౌరవం

01-08-2024 01:19:40 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలోనే ఆడబిడ్డలకు సముచిత గౌరవం  దక్కిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అని కొనియాడారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఐదుగురు మహిళలు పని చేశారని గుర్తుచేశారు. సీఎల్పీ నేతగా గతంలో భట్టివిక్రమాక్క ఉంటే, నాడు సబితా ఇంద్రారెడ్డికి ఇష్టం లేకపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డితో పాటు మంత్రి సీతక్కను కూడా సీఎం రేవంత్‌రెడ్డి సోదరి అని సంబోధిస్తారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు సీఎంను ఏకవచనంతో సంబోధించడం సబబు కాదన్నారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఎక్కడికి వెళ్లారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డికి దిక్కూదివాణా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఆదరించిందని గుర్తుచేశారు. రామగుండం  ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ.. మహిళలను సీఎంలను, మంత్రులు, ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కొనియాడారు. కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు సబితాఇంద్రారెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.