calender_icon.png 22 April, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రైతుకు గౌరవం పెరిగింది

21-04-2025 05:51:42 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరి ఖని,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని, సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. జనగామ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి కటింగ్ లు లేకుండా వడ్ల కొనుగోలు కు పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి ప్రస్తుతం నాలుగో సారి కటింగ్లు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్టు చెప్పారు.  గతంలో బీఆర్ఎస్ పాలనలో కటింగ్ ల పేరిట రైతులను నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. నియోజకవర్గంలో జనగామ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందారని, త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, .కాంగ్రేస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.