calender_icon.png 29 September, 2024 | 3:02 PM

డబుల్ బెడ్రూంల్లోకి మూసీ నిర్వాసితులు

28-09-2024 01:29:48 AM

హైదరాబాద్ జిల్లాలో 20కుటుంబాల తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): మూసీ పరి వాహక ప్రాంతంలో నివాసముంటు న్న 20 కుటుంబాలను అధికారులు డబుల్ బెడ్రూంల్లోకి తరలించినట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయ త్‌నగర్ మండలం శంకర్‌నగర్‌లోని ఆరు కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను,  మల క్‌పేట్‌లోని పిల్లి గుడిసెల్లో ఉన్న వారిని డబుల్‌బెడ్‌రూంల సముదాయంలోకి తరలించామని చెప్పారు.

అలాగే నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసీఫ్‌నగర్, జియాగూడకు తరలించినట్లు చెప్పారు. కాగా పిల్లి గుడిసెల వద్ద గల డబుల్ బెడ్రూంల్లోకి వస్తున్న వారి పట్ల స్థానికంగా ఉంటున్న డబుల్ ఇండ్ల లబ్ధిదారులు, నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.