నిర్మల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స మగ్ర బీసీ కులాల లెక్కింపు తర్వాతనే రాష్ట్ర ంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నవ సంఘర్షణ సమితి బీసీ నేత అప్క గజేందర్యాదవ్ కోరారు. సోమవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుల ఆ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. బీసీల సంఖ్యను బట్టి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎన్ రెడ్డి, హింద్గౌడ్, బాలరాజు పాల్గొన్నారు.