ఎంపీ ఒక వినతి పత్రం అందజేసిన దివ్యాంగులు..
చర్ల (విజయక్రాంతి): దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రాజకీయ ఉపాధి సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రేగళ్ల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మంగళవారం ఎంపీఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ... సంక్షేమ రంగాలలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, 100% దివ్యాంగుల రుణాలను చర్ల మండలానికి అత్యధిక కేటాయించాలని, దివ్యంగుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు సురేష్ రెడ్డి, సాగర్, సుబ్రహ్మణ్యం, కేశవులు తదితరులు పాల్గొన్నారు.