16-04-2025 08:54:16 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందులో జీవో నెంబర్ 76 ఇండ్ల క్రమబద్ధీకరణ జీవోను పునరుద్ధరించాలని, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. టీయూ సిఐ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఇల్లందు పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు గానీ రిజిస్ట్రేషన్ లేని పరిస్థితి నుండి గత ప్రభుత్వం జీవో నెంబర్ 76 ద్వారా ఇల్లందు పట్టణంలోని ఇండ్ల యజమానులు ఆన్లైన్ చేసుకొని కొంతమంది పట్టాలు పొందినారు. ఇంకా మిగిలిపోయిన వారు చాలామంది డిడీలు కట్టి ఉన్నారు.
వారికి కనబబద్దీకరణ పట్టాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. జిల్లా అధికారులు ఎమ్మెల్యే జోక్యం చేసుకొని 76 జీవోకి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెవెన్యూ వారి ద్వారా ఇళ్ల పట్టాలు, ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా జిల్లా మంత్రుల ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి, జీవో 76ను పునరుద్ధరించే విధంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు ఎస్ డి రంజాన్, వేముల గురునాథం, కొత్తపల్లి రఘు, టియుసిఐ ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.