calender_icon.png 2 March, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసీదుల వద్ద సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

01-03-2025 08:12:05 PM

బిజెపి మైనార్టీ సెల్ నాయకుల విన్నపం...

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని బిజెపి పార్టీ  మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు. ఈనెల ఫిబ్రవరి 2 తేది ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభంకావడం జరుగుతుందని తెలిపారు. రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. మసీదుల వద్ద భద్రత కల్పించాలని ఏఎస్పి చైతన్య రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అధికారులు ఇద్దరు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, 22వ వార్డు ఇన్చార్జి మహమ్మద్ మేరాజ్, సయ్యద్ ముజఫర్, షకీలొద్దీన్ పాల్గొన్నారు.