బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రం అందజేశారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచి ఇవ్వాలని, స్కాలర్షిప్ తో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్ లు అందించాలని వినతిపత్రంలో వారు కోరారు. అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు నిర్వహించారు.