calender_icon.png 27 September, 2024 | 4:52 AM

కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

26-09-2024 08:44:50 PM

ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్స్ కేంద్రం ఏర్పాటుకు వినతి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ విన్నవించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రక్షణ శాఖకు చెందిన 369 ఎకరాల భూమి ఉందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మరో 1,592 భూమిని గుర్తించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం భూమి సేకరించి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం కోరిన విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉందని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని తన శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలో పూర్తి వివరాలు తెలపాలని ఆదేశించారని ఎంపీ నగేష్ పేర్కొన్నారు.