26-01-2025 04:17:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందలను స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలను ఆమె వివరించారు. దేశంలో పోలీసు వ్యవస్థ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.