కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ ను శుక్రవారం బీర్కూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి కోసం పాటుపడు తానాని బాలకిషన్ తెలిపారు. పేద ఆర్యవైశ్యులకు విద్యా సౌకర్యాన్ని కల్పిస్తామని ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే సంఘం దృష్టికి చేస్తే జిల్లా సంఘం తరఫున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని ఆయన తెలిపారు.
మండల కమిటీలను ఏర్పాటు చేసి పాటిస్తావంతం చేయాలని మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల కు సూచించారు. అందరూ ఐకమత్యంతో ఉండి పేద ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ప్రతి ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులకు ఉందని తెలిపారు. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని వ్యాపార పరంగా రాజకీయపరంగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుని కంచర్ల బాలకిషన్ ను ఘనంగా సన్మానించారు.