calender_icon.png 28 October, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3వ తేదీలోపు నివేదికివ్వండి!

01-08-2024 01:20:36 AM

అధికారులను ఆదేశించిన క్యాబినెట్ సబ్‌కమిటీ

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికత, స్పౌజ్, ఇతర అంశాలకు సంబంధించి వివరాలను ఈనెల 3లోపు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో సమావేశమైన క్యాబినెట్ సబ్‌కమిటీ కొంత మంది ఉద్యోగుల పూర్తి వివరాలను అధికారులు కమిటీకి సమర్పించలేదని తెలిపింది. ఈ క్రమంలోనే తాజా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతకు సంబంధించి ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. స్పౌజ్ కేసులకు సంబంధించి భర్త, భార్య ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? వారి సర్వీస్ రికార్డులు సైతం పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కమిటీకి నివేదిక అందిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.