కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.12 లక్షల వరకు పన్ను రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏడాదికి రూ. లక్ష కోట్ల వరకూ లోటు ఏర్పడనున్నా, మినహాయింపులు ఇవ్వడం అభినందనీయం. మరోవైపు మధ్యతరగతి వారి జీతభత్యాలలోనూ పెరుగుదల సంభవించనున్నట్టు వార్త సంతోషాన్ని కలిగిస్తున్నది. చాలాకాలంగా వేతన జీవులు పన్ను మినహాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు.
సహర్ష, ఓల్డ్ ఆల్వాల్