హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు భారీ విరాళం అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావు శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నీతా అంబానీ తరపున చెక్ ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎంకు అందజేశారు.