కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల
కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల
04-09-2024 10:48:38 AM
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని యానంబైలులో గల కిన్నర సాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 404.40 అడుగులకు చేరుకుంది. జెన్కో అధికారులు జలాశయం భద్రత దృష్ట మూడు గేట్లను ఎత్తి 11వేల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. జలాశయానికి పదివేల క్యూసెక్కుల నీరు కొత్తగా వచ్చి చేరుతుంది.