calender_icon.png 15 October, 2024 | 11:42 AM

గ్రూప్-1 హాల్ టికెట్స్ విడుదల

15-10-2024 03:07:11 AM

హైదరాబాద్, అక్టోబర్ 14( విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను గతంలోనే  టీజీపీఎస్‌సీ నిర్వహించింది.

ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీన నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను 3.02లక్షల మంది రాయగా.. 31,382 మంది  మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌లో అభ్యర్థులు మొత్తం ఏడు పేపర్లను రాయాల్సి ఉంటుంది.