calender_icon.png 25 October, 2024 | 3:50 AM

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల

25-10-2024 01:49:25 AM

ముంబై, అక్టోబర్ 24: మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ 48 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సకోలీ నుంచి, సునీల్ దేశ్‌ముఖ్ అమరావతి నుంచి, కునాల్ రోహిదాస్ పాటిల్ ధూలే రూరల్ నుంచి, జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ ధారావి నుంచి పోటీ చేయనున్నారు.

వీరితోపాటు మరికొందరి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇండియా కూటమికి చెందిన మూడు పారీల్లోని ఒక్కొక్క పార్టీ 85 స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే 65 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేశారు. శరద్ పవార్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి జాబితాను ప్రకటించలేదు.