టీజీఎస్టీసీఈఏ అధ్యక్షుడు సంతోష్కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఇతర రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లలో చదివే తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీజీఎస్టీసీఈఏ) అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ కోరారు. గత విద్యాసంవత్సరంలో ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించిందని, ఈసారి కూడా భరించాలని విజ్ఞప్తిచేశారు. గత ఏడాది ఫీజు చెల్లించిన అధికారులు.. ఈ సంవత్సరం ఇవ్వబోమని చెప్పడం సరికాదని తెలిపారు.