calender_icon.png 19 October, 2024 | 2:55 PM

రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి

19-10-2024 12:26:31 PM

ఏబీవీపీ ఆధ్వర్యంలో గజ్వేల్ లో ర్యాలీ 

గజ్వేల్ (విజయక్రాంతి): గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ వివేక్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో శనివారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుండి వివేకానంద చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.

గత మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయని పక్షంలో తమ చదువులు మధ్యంతరంగానే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ను, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మహేందర్, నవీన్, చందు, ప్రదీప్, రమాకాంత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. కాగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో  గజ్వేల్ సిఐ సైదా ర్యాలీని మధ్యలోనే అడ్డుకున్నారు.