సిద్ధిపేటలో లైంగికదాడి కేసుపై హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆరా
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామంలో 5వ తరగతి చదువుతున్న బాలికపై గత శుక్రవారం జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యా నా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు దత్తాత్రేయ మంగళవారం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధకు ఫోన్ చేసి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
బాధిత బాలికకు పునరావాస ఏర్పా ట్లు చేయాలని కోరారు. పారదర్శకంగా విచారణ జరిపి నిందితుడుని కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్.. గవర్నర్కు హామీ ఇచ్చారు. కాగా బాలిక లైంగికదాడి ఘటనపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి .. జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.