‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. అంతర్జాతీయ స్థాయికి ఈ సినిమా ఎదిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప సీక్వెల్పై అంచనాలు బాగా పెరిగాయి. ఇదిలా ఉండగా ‘పుష్ప ౨’ తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో చిత్రం పట్టాలెక్క నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత నాగవంశీ మంచి అప్డేట్ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
“అల్లు అర్జున్, త్రివిక్రమ్ల సినిమా స్క్రిప్ట్ పూర్తి కావొచ్చింది. దీని పూర్తి వివరాలను ‘పుష్ప 2’ విడుదల తర్వాత జనవరిలో స్పెషల్ ప్రోమోతో వెల్లడిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. అల్లు అర్జున్ కూడా అప్పుడే చిత్రీకరణలో పాల్గొంటారు.
ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. అయితే ఈ సినిమా ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఉంటుంది. మంచి విజువల్స్తో ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం” అని నాగవంశీ తెలిపారు. ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ వెంటనే బన్నీ సినిమా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.