నూతన తహసీల్దార్గా నరేశ్ నియామకం
రేగోడ్(మెదక్), సెప్టెంబర్ 20: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెదక్ జిల్లా రేగోడు తహ సీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం మెదక్ ఆర్డీవో రమాదేవి రేగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమ యంలో తహసీల్దార్ బాలలక్ష్మి అం దుబాటులో లేకపోవడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీవో జిల్లా కలెక్టర్కు సమగ్ర నివేదికను అందించారు. ఈ మేరకు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బాలలక్ష్మి స్థానంలో నూత న తహసీల్దార్గా మెదక్లో పనిచేస్తున్న నరేశ్ను నియమించగా ఆయ న విధుల్లో చేరారు.