calender_icon.png 21 September, 2024 | 2:19 PM

పీఎస్ ఎదుట రీల్స్

21-09-2024 12:15:00 AM

ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ ఎదుట రీల్స్ చేసిన ఇద్దరిపై కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎదుట రీల్స్ చేసిన ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆకతాయిల వ్యవహారంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో చర్యలు చేపట్టాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఓ వ్యక్తి వీడియోను ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు స్టేషన్ ఎదుట రీల్స్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.