calender_icon.png 30 September, 2024 | 4:48 AM

రీల్స్ పిచ్చి.. సైన్‌బోర్డుపై పుల్‌అప్స్

30-09-2024 12:00:00 AM

అమేఠీ, సెప్టెంబర్ 29: గుర్తింపు పొందేందుకు చాలామంది ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరి గింది. అమేఠీ హైవేపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్లకు పాల్పడ్డాడు. సైన్‌బోర్డుపైకి ఎక్కి పుల్ అప్స్ తీశాడు. నేల నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు సైతం బోర్డు ఎక్కి అతడిని వీడియో తీశాడు.

ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్రాణాలు చాలా విలువైనవి. రీల్స్ కోసం ఇలా తెగించడం సరికాదు’ అని ఒకరు ‘ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదని’ మకొకరు పోస్టులు పెట్టా రు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి స్టంట్ల కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామన్ననారు.