11-03-2025 09:00:30 PM
ఎల్బీనగర్: రెడ్డి సామాజిక వర్గం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో మంగళవారం అంతర్జాతీయ రెడ్డి మహిళల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ డివిజన్ల కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో రెడ్డి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి, ప్రధాన కార్యదర్శి తరుణ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శ్రీవాణి రెడ్డి, కరుణారెడ్డి, ప్రశాంతి రెడ్డి, విజయ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.