calender_icon.png 24 October, 2024 | 4:02 AM

మంథనిలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం లడ్డు వేలంపాట

17-09-2024 03:40:32 PM

మంథని,(విజయక్రాంతి): మంథని రెడ్డి సేవా సంక్షేమ సంఘం వారి  ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మంగళవారం నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్న ముస్కుల లేఖన-లోకేందర్ రెడ్డి రూ.15,116 (పదిహేను వేయిల ఒకవంద పదహారు రూపాయల)కు  లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, రెడ్డి సంఘం నాయకులు ముసుకుల సురేందర్ రెడ్డి, ఎక్కేటి అనంతరెడ్డి, పెండ్రు సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.