calender_icon.png 23 September, 2024 | 4:01 AM

అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి రెడ్డి జేఏసీ మద్దతు

20-09-2024 12:00:00 AM

కరీంనగర్ సిటీ, సెప్టెంబరు 19: అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డికి రెడ్డి జేఏసీ మద్దతు తెలిపింది. గురువారం నరేందర్‌రెడ్డిని జేఏసీ ప్రతినిధులు ఎ రాంరెడ్డి, పీ రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చుక్కారెడ్డి కలిసి మద్దతు ప్రకటించారు. అల్ఫోర్స్‌తో రాష్ట్రంలోని విద్యారంగం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, విద్యార్థులకు తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యనందిస్తూ అగ్రగామిగా కొనసాగుతుండటంపట్ల హర్షం వ్యక్తం చేశారు. గొప్ప విద్యావేత్త, సౌమ్యశీలియైన నరేందర్‌రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓ విద్యావేత్తగా తనకు పట్టభద్రుల సమస్యలై పూర్తిగా అవగాహన ఉన్నదని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రులకు అన్ని విషయాల్లో ప్రాధాన్యం కల్పించే విధంగా కృషిచేస్తానని చెప్పారు.