calender_icon.png 3 October, 2024 | 8:58 PM

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

03-10-2024 05:11:54 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): రాష్టంలోని నిరుపేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ రూ.5వేల కోట్లతో ఏర్పాటు చేసి రెడ్డి నిరుపేదలను అదుకోవాలని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు అయిలేని మల్లికార్జున రెడ్డి కోరారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో రెడ్డి జెఎసి నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు.   రాష్ట్ర రెడ్డి జె ఎ సి ఆధ్వర్యంలో అక్టోబర్ 6న హైదరాబాద్ శిల్ప వేదిక లో జరుగనున్న రెడ్డి ప్రజాప్రతినిధుల  సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవoతము చేయాలనీ జిల్లా రెడ్డి కుల బంధువులకు పిలుపునిస్తున్నామన్నారు. సన్మాన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రెడ్డి ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం రెడ్డి సమస్యల పై ముఖ్య మంత్రికీ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పణ్యల విష్షువర్ధన్ రెడ్డి, ముత్యాల దేవేందర్ రెడ్డి,  కర్నె సంతోష్ రెడ్డి, ఆరుట్ల రాజీ రెడ్డి, గూడ పద్మ, గాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాకాల భూపాతి రెడ్డి, పదిరే శ్యామ్ రెడ్డి, నర్సింహా రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మోసర్ల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.