సింగరేణి సీఎండీ ఎన్ బలరాం
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సింగరేణిలోని వివిధ ఖాళీలకు నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి 599 పోస్టుల నియామక ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ ఎన్ బలరాం సంబంధిత అధికారులను ఆదేశించారు.
272 పోస్టులకు గురువారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలవుతున్న నేపథ్యంలో బుధవారం అధికారులతో హైదరాబాద్ సింగరేణిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పారదర్శకంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే 300 మంది కారుణ్య నియామక అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎక్స్టర్నల్ పద్ధతిలో నిర్ధేశించుకున్న 599 పోస్టులను తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అత్యంత పకడ్బందీగా నిర్వహించామని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేపట్టాలన్నారు.