28-04-2025 12:37:00 AM
కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంపై జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో వక్తలు
ఖమ్మం, ఏప్రిల్ 27( విజయక్రాంతి ):-పార్టీ సంస్థాగత నిర్మాణం లో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేషన్ సంస్థలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసు కుందని వరంగల్ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, బత్తిన శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జరిగిన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశం లో వా రు మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశంలో ,గ్రామశాఖ, మండల, పట్టణ, బ్లాక్ స్థాయి కమిటీలకు సుమారు 5గురి పేర్లతో ప్రతిపాదనలు పంపాలని, అట్టివారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వారిని సూచించాలని అన్నారు.
పార్టీ పదవులలో ఉండి పార్టీ కోసం పనిచేయాలని, పని చేయలేనివారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరా రు. అనంతరం రాష్ట్ర జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్ పులి అనిల్ కుమార్ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై సవివరంగా వివరించారు.జిల్లా కాంగ్రెస్ క మిటీ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా నుండి అత్యధిక స్థానాలు అందించిన శ్రేణులకు పేరు,పేరున దన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనస భ సభ్యులు మట్టా రాగమయి, వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాలోత్ రాం దాసు నాయక్, మాజి శాసనమండలి సభ్యు లు పోట్ల నాగేశ్వరరావు,పాలేరు నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అభియాన్ కో ఆర్డినేటర్ మన్నే సతీష్, రాష్ట్ర చేనేత,
హస్త కళల అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మ న్ దొండపాటి వేంకటేశ్వరరావు,పి సి సి అదికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం,సిటీ కాం గ్రెస్ కమిటీ అద్యక్షులు మహ్మద్ జావేద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటి మేయ ర్ ఫాతిమా ముక్తార్ జోహార,జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు కొత్తా సీతారాములు,
దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, వేజెండ్ల సాయికుమార్,సయ్యద్ ముజాహిద్ హుస్సే న్, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిషోర్, రాష్ట్ర ఓబిసి నాయకులు హారికా నాయుడు, పి సి సి సభ్యులు, బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, నగర కార్పొరేటర్లు, మాజి మున్సిపల్ చైర్మన్ లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.