calender_icon.png 9 October, 2024 | 2:50 PM

హైదరాబాద్‌లో 616మందికి నియామక పత్రాలు

09-10-2024 01:30:49 AM

దాదాపు 8 మంది అభ్యర్థుల ఎంపిక పెండింగ్?

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8(విజయక్రాంతి): డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, ఉపాధ్యాయులుగా ఎంపికైన హైదరాబాద్ జిల్లాకు చెందిన 616 మందికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయ నియామక పత్రా లు అందజేయనున్నారు. జిల్లా లో మొత్తం 878 పోస్టులకుగాను అధికారులు 616మందిని ఎంపిక చేయగా.. మరో 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉర్దూ మీడియంలో రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులను అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే దాదా పు 8 మంది అభ్యర్థులు వివిధ శాఖల్లో ఇన్‌సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్లు ఆరోపణలున్నందున వారి ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.