calender_icon.png 14 October, 2024 | 5:51 AM

ఈపీఎఫ్‌వోలో రికార్డు చేరికలు

21-08-2024 12:30:00 AM

జూన్‌లో 19.29 లక్షల సభ్యుల జత

ముంబై, ఆగస్టు 20: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో జూన్ నెలలో  రికార్డు స్థాయిలో నికరంగా 19.29 లక్షల మంది సభ్యులు జతయ్యారు. గతం లో ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు కూడా వీరిలో ఉన్నారు. కొత్తగా 10.25 లక్షల మంది చేరారు.  కొత్త సభ్యుల్లో 2.98 లక్షల మంది మహిళలు ఉన్నారు. మంగళవారం కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన పేరోల్ డాటా ప్రకారం 2023 జూన్ తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 7.8 శాతం మంది అధికంగా చేరారు.  దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు లభించే ప్రయోజ నాల పట్ల అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాల సమర్థత సభ్యత్వ పెంపునకు దోహదపడినట్టు కార్మిక శాఖ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18 వయస్సుగలవారు 59.14 శాతం ఉన్నారన్నారు.