జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో ప్రయాణం
పిల్లల ప్రాణాలతో చెలగాటం..
రాజాపూర్ (విజయక్రాంతి): జడ్చర్ల పట్టణంలోని ఉదయ్ మెమోరియల్ స్కూల్ బస్సు ప్రతి నిత్యం రాజాపూర్, ముదిరెడ్డి పల్లి, పోలేపల్లి నుండి జడ్చర్ల కు విద్యార్థులను తీసుకెళుతుంది. మండలం నుండి సుమారు 55 మంది చిన్నారులు పాఠశాలకు వెళుతుంటారు. రాజాపూర్ లో విద్యార్థులను తీసుకొని పోలేపల్లి వెళ్ళాలి. అదే బస్సుకు పోలేపల్లి గ్రామంలో కొందరు విద్యార్థులను పికప్ చేసుకునేందుకు వెళ్ళాలి. ముదిరెడ్డి పల్లి దగ్గర జాతీయ రహదారిపై అపశ్రావ్య దిశలో బస్సును తీసుకపోవడం పిల్లల ప్రాణాలతో చెలగాటం అడడమే. మాచారం, లేదా గొల్లపల్లి నుండి బస్సు వెళ్ళాలి కానీ దూరం తగ్గించి డిజిల్ ఆదా కోసం బస్సు డ్రైవర్ విద్యారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నడు, గతంలో ఇదే ముదిరెడ్డి పల్లి దగ్గర చాలా భారీ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ బస్ డ్రైవర్ వ్యవహారంపై విద్యారుల తల్లిదండ్రులు, మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పిల్లల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదయ మెమోరియల్ స్కూల్ బస్సు డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.