calender_icon.png 24 October, 2024 | 5:53 PM

రుణమాఫీ దరఖాస్తుల స్వీకరణ

29-08-2024 04:26:07 PM

దౌల్తాబాద్: పంట రుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి రైతు పోర్టల్ యాప్ లో నమోదు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జాదవ్ సాయికిరణ్ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కుటుంబ నిర్ధారణ కోసం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 408 మంది కి కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉందని తెలిపారు. నిర్ధారణ అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. రుణమాఫీ కానీ రైతుల ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంకు వివరాలను రైతు పోర్టల్ యాప్ లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సంతోష్, రైతులు పాల్గొన్నారు.